ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కుట్ర వెనుక సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్తో సహా పలువురు సీనియర్ న్యాయవాదుల పాత్ర ఉందని ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ సంచలన ఆరోపణ చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.
చీఫ్ జస్టిస్పై ఆరోపణలు చేసిన మహిళ వెనుక న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఇందిరా జైసింగ్ ఉన్నారని పలు కథనాలు వచ్చినట్లు ఎంఎల్ శర్మ పేర్కొనగా, ఈ అంశాన్ని తమ ధర్మాసనం ముందు కాకుండా వేరే ధర్మాసనం ముందు ప్రస్తావించాలని జస్టిస్ రంజన్ గొగొయ్ సూచించారు.
దీనిపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి ఎంఎల్ శర్మ తీసుకువెళ్లి పిటిషన్ వేస్తాననీ, అత్యవసర విచారణ జరపాలని కోరగా ఆయన వినతిని ధర్మాసనం తిరస్కరించింది.