(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు యూపీ, బీహార్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు ఇప్పటి వరకు 80 మంది మృతి చెందారు. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో యూపీలో 73 మంది చనిపోయారు. చాలా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. శనివారం 26 మంది మృత్యువాత పడగా.. గురు, శుక్రవారాల్లో వివిధ ప్రాంతాల్లో 47 మంది మరణించారు. లక్నో, అమేథీ, హర్దోయ్ తో బాటు మరికొన్ని జిల్లాల్లో స్కూళ్లను రెండురోజులుగా మూసివేశారు. భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు 4 లక్షల చొపున పరిహారాన్ని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
Patna Flooding – 4
This is famous NMCH (Nalanda Medical College and Hospital)
Look at the condition of patients@alamgirizvi @DEBKANCHAN @SaurabhShahi6 @ajitanjum @anjanaomkashyap @kingofhell_IN @scaredindia @Aquib__Ameer @isaurabhshukla @Mr_Singh86_ pic.twitter.com/pq6rb4kWDj— Farookh?️ (@farrookh) September 28, 2019
బీహార్లోనూ చాలా జిల్లాలు వరద నీటిలోనే ఉన్నాయి. రాజధాని పాట్నాలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 18 ఎన్డీఆర్ఎఫ్ టీములు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదలతో ఇళ్ల లోపలికి నీళ్లు వెళ్లాయి. సేఫ్ బోట్ ల ద్వారా రెస్క్యూ టీంలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నలంద మెడికల్ కాలేజీ, హాస్పిటల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఐసీయూలోకి కూడా నీరు ప్రవేశించడంతో రోగులు, వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH Vehicles wade through water at Dak Bunglow intersection in Patna, following heavy rainfall in the region. #Bihar pic.twitter.com/FD8txzywwd
— ANI (@ANI) September 28, 2019
Reports of heavy rainfall and flood like situation coming in from PATNA.hope all of you are safe!!!
— manoj bajpayee (@BajpayeeManoj) September 29, 2019