విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన ఒడిసా సీనియర్ బిజెపి నేత బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్కుమార్ బిశ్వభూషన్చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో పాటు మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు ముఖ్య అధికారులు, రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేలు పాల్గొని నూతన గవర్నర్ బిశ్వభూషన్కు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా ఇఎస్ఎల్ నరసింహన్ వ్యవహరించారు.