ఎపి కొత్త గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఇఎస్ఎల్ నరసింహన్ స్థానంలో బిశ్వభూషణ్ హరిచందన్ను నియమించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒదిషా రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బిశ్వభూషన్ ప్రముఖ న్యాయవాది.
ఇంటలిజెన్స్ బ్యూరో అధిపతిగా పనిచేసిన ఐపిఎస్ అధికారి నరసింహన్ 2009 నుంచి ఏకధాటిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. 2014లో రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కూడా ఆయననే రెండు రాష్ట్రాలకూ గవర్నర్గా కొనసాగించారు. ఇక తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించేవరకూ ఆయన ఆ రాష్ట్రానికి గవర్నర్గా కొనసాగుతారు.