బ్యాంకులకు బురిడీ కొట్టించడానికే రుణాలు తీసుకుంటారు పెద్దోళ్ళు…! విజయ్ మాల్యా మొదలుకుని… నీరవ్ మోడీ. లాంటి వాళ్ళు ఉదాహరణగా ఉండేవారు. తాజాగా ఈ జాబితాలోకి “తెలుగు” బిజెపి నాయకుడు సుజనా చౌదరి చేరిపోయారు. 120 డమ్మీ కంపెనీలు పెట్టి బ్యాంకుల నుండి రూ. 6 వేలకోట్లు తీసుకుని ఎగ్గొట్టారని అప్పట్లో సిబిఐ సుజనాని విచారించింది. తర్వాత ఆయన బీజేపీలో చేరిపోవడం, విచారణ నెమ్మదించడం అందరికీ తెలిసిందే. తాజాగా మళ్ళి సుజనా బ్యాంకుల బురిడీ తతంగం బయటకు వచ్చింది. ఇండియన్ బ్యాంకుకి ఆస్తులను తాకట్టు పెట్టి రూ .400 కోట్లు ఋణం తీసుకుని చౌదరి గారు ఎగ్గొట్టారు. ఆ ఆస్తులు ఇప్పుడు అమ్మేసి తమ అప్పు తీర్చుకోవాలని సదరు బ్యాంకు వేలం వేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు పత్రికలో ప్రకటన కూడా వచ్చింది.
సుజనా పాపం… “తెలుగు బిజెపి” నాయకుడు అయ్యారు…!
సుజనా చౌదరి అంటే కరుడు కట్టిన టిడిపి వాది. ఇది జగమెరిగిన సత్యం. అలాంటిది ఈ “చౌదరి” తమ పార్టీని వీడి గత ఏడాది బీజేపీలో చేరిపోయారు. అంతే కాదు ఆయనతో పాటూ సీఎం రమేష్, గరికపాటి లాంటి మరో ముగ్గురు కరుడు కట్టిన టిడిపి వాదులను బీజేపీలో కలిపేశారు. అక్కడికి కొద్దీ రోజుల మునుపే ఆయనపై సిబిఐ విచారణ చేపట్టింది. ఈడి కూడా దృష్టి పెట్టింది. రూ. 6 వేల కోట్లు వరకు బ్యాంకులకు ఎగ్గొట్టారని ఆరోపణ. వాటి నుండి తప్పించుకునేందుకు తన “పరపతి” కాపాడుకోడానికి మాత్రమే తన పార్టీని వీడి మనసు ఇక్కడ పెట్టి… మనిషి అక్కడికి వెళ్లారని అంటుంటారు. కానీ ఆ పరపతి ఒక్కోటీ చేజారిలాగే ఉంది. అక్కడ ఉన్నది మోడీ, ఆయనకు తోడు అమిత్ షా… అవినీతి మరకలు అంటుకోనివ్వరు, అంటితే అంటకాగేస్తారు. అందుకే సుజనా కంపెనీ పేరిట ఉన్న రుణాలు తీర్చకపోతే వదలమని ఇండియన్ బ్యాంకు నిరూపించింది. ఇదే స్పూర్తితో ఆంధ్ర బ్యాంకు ( 71 కోట్లు)… సెంట్రల్ బ్యాంకు ( 133 కోట్లు) .., కార్పొరేషన్ బ్యాంకు (159 కోట్లు) కూడా రికవరీకి యత్నిస్తాయేమో చూడాలి. ఈ బ్యాంకులకు ఈయన గారు కొన్ని ఫేక్ బ్యాంకు స్టేట్మెంట్లు చూపించి, నకిలీ కంపెనీలతో రుణాలు తీసుకున్నారు. తిరిగి పైసా కూడా చెల్లించలేదు. ఇలా ఈయన మొత్తం రూ. 6 వేల కోట్లు వరకు ఎగ్గొట్టి ఉంటారని ఆరోపణ ఉంది.