(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అసోంలో ఓ బీఎస్ఎఫ్ పోలీస్ అధికారిని ఆయన భార్యను విదేశీయులుగా ప్రకటించారు. అసోంలోని ఉదయ్పూర్కు చెందిన ముజిబుర్ రెహ్మాన్ బీఎస్ఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్లో విధులు నిర్వహిస్తున్నారు. గత డిసెంబర్లో విడుదల చేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) ముసాయిదా జాబితా నుంచి రెహ్మాన్ పేరును తొలగిస్తూ అధికారులు అసోంలోని అతని నివాసానికి లేఖ పంపారు. అయితే, పంజాబ్లో ఉన్న ఆయనకి ఆ విషయం తెలియలేదు. గత నెలలో ఏదో పనిపై ఊరికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనతో పాటు ఆయన భార్య పేరును కూడా జాబితా నుంచి తొలగించినట్లు గ్రామస్థులు తెలిపారు. విచారణకు అందుబాటులో లేకపోవడంతో రెహ్మాన్పై ఫారెనర్స్ ట్రైబ్యునల్ ఎక్స్ప్యార్టీ ఆదేశాలు జారీ చేసింది. అయితే రెహ్మాన్ తల్లిదండ్రులు, తోబుట్టువులను మాత్రం భారత పౌరులుగా గుర్తించడం గమనార్హం.
దీనిపై స్పందించిన రెహ్మాన్ ఫారెన్ ట్రైబ్యునల్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. తాను బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందిన వాడిని కాదని, తన వద్ద 1923నుంచి ఉన్న భూదస్త్రాలు ఉన్నాయని తెలిపారు. ఓ వ్యక్తి ఇచ్చిన తప్పుడు సమాచారంతో తమని ఎన్ఆర్సీ జాబితా నుంచి తొలగించారని వాపోయారు. విచారణ సమయంలో పంజాబ్లో ఉండడంతో ఫారెన్ ట్రైబ్యునల్ తమని ఎటువంటి ఆధారం లేకుండానే విదేశీయులుగా గుర్తించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అస్సాంలో, 100 ఎఫ్టిలు ఉన్నాయి. ఇది పాక్షిక-న్యాయవ్యవస్థ. ఇది పోలీసుల సరిహద్దు యూనిట్ ద్వారా అనుమానిత విదేశీయులుగా పిలువబడే వ్యక్తుల పౌరసత్వంపై తీర్పు ఇస్తుంది. వీరిని ‘డీ’ ఓటర్లుగా పిలుస్తారు. అసోంలో నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజన్స్ను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీని లక్ష్యం స్వదేశీయులకు భద్రత కల్పించడం, అక్రమ చొరబాటుదారులను గుర్తించి ఏరివేయడం. రాష్ట్రంలో రెండు విడతలగా పౌరుల జాబితా ముసాయిదాను ప్రభుత్వం వెలువరించింది. గతేడాది జూలైలో మొదటి విడత, ఈ ఏడాది జూన్లో రెండో జాబితాను విడదుల చేసింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి నోటీసులు ఇచ్చింది. తమ పౌరసత్వాన్ని ధృవీకరించే పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ విధంగా రాష్ట్రంలోని 3.29 కోట్ల మంది ప్రజలు తమ వద్దనున్న పౌరసత్వ ఆధారాలను సమర్పించారు. అయితే అందులో కొందరిని డీ ఓటర్లుగా గుర్తించారు. అంటే వారు ఈ జాబితా తయారీ సమయంలో అందుబాటులో లేరు.