(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కోల్కతా పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న తరుణంలో బిజెపి నేత ఒకరు అందులో ముస్లింలకు చోటు లేకపోవడాన్ని ప్రశ్నించారు. సిఎఎకి ఏ మతంతోనూ సంబంధం లేదన్నపుడు ముస్లింలను కూడా అందులో కలపవచ్చు కదా అంటూ పశ్చిమ బెంగాల్ బిజెపి ఉపాధ్యక్షుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనుమడు చంద్రకుమార్ బోస్ ట్వీట్ చేసారు. సిఎఎకి మద్దతుగా బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా కోల్కతాలో భారీ ర్యాలీ తీసిన తర్వాత కొన్ని గంటలకు బోస్ ట్వీట్ చేశారు.
If #CAA2019 is not related to any religion why are we stating – Hindu,Sikh,Boudha, Christians, Parsis & Jains only! Why not include #Muslims as well? Let's be transparent
— Chandra Kumar Bose (@Chandrakbose) December 23, 2019
భిన్న మతాలకూ, కులాలకూ వేదికయిన ఇండియాను మరే దేశంతోనూ పోల్చలేమని బోస్ పేర్కొన్నారు. సిఎఎతో మతాలకు ప్రమేయం లేకపోతే ముస్లింలను కూడా చేర్చవచ్చుగా. స్వదేశంలో వారి పట్ల వివక్ష లేకపోతే ఎటూ ఇండియా రారు. అయినా అది నిజం కాదు. పాకిస్తాన్లో అహ్మదీయ ముస్లింలు, బెలూచీలు ఎదుర్కొంటున్న వివక్ష మాటేమిటి అని చంద్రకుమార్ బోస్ వ్యాఖ్యానించారు.