(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కాలిఫోర్నియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. శాంటక్రూజ్ దీవి సమీప తీర ప్రాంతంలో ఓ పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 34 మంది గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన తీరంలోని రక్షకదళం.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ పడవ పూర్తిగా కాలిపోయింది. అందులో నుంచి అయిదుగురిని రక్షించామని.. మిగతా 34 మంది ఆచూకి తెలియరాలేదని రెస్క్యూ టీం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుఝామున 3.28 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
శాంటక్రూజ్ ద్వీపానికి 18మీటర్ల దూరంలో పడవ ప్రమాదానికి గురైంది. మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్టు రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. పడవలో మొత్తం ఎంతమంది ఉన్నారనే అంశంపై ఇంకా స్పష్టత లేదని వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.