(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సిబిఐ, ఈడి కోర్టులో ఏపి సిఎం జగన్కు మళ్లీ చుక్కెదురైనది. ఈడి కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల సిబిఐ కేసుల్లో వ్యక్తిగత హజరు మినహాయింపునకు న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈడీ కేసుల్లోనూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
ఈ రోజు జరిగిన విచారణ నుండి జగన్కు ముందే మినహాయింపు లభించడంతో ఆయన హజరుకాలేదు. మిగతా నిందితులు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వ్యాపారవేత్తలు ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తదితరులు విచారణకు హజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.