(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి:టిడిపి నేత, మాజీ ఏంపి రాయపాటి సాంశివరావు నివాసం, కార్యాలయాలలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపి, తెలంగాణతో పాటు కర్నాటక, ఢిల్లీలో కూడా ఏకకాలంలో ఈ దాజులు కొనసాగుతున్నాయి. ఇండియన్ బ్యాంక్ నుండి 300 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న రాయపాటి కంపెనీ తిరిగి రుణం చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు గతంలోనే కేసు నమోదు చేశారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీతో పాటు పలు కంపెనీల్లో సిబిఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాల్లో సిబిఐ సొదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ రాయ్ కంపెనీ సిఇఒ చెరుకూరి శ్రీధర్ నివాసంలోనూ సిబిఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.