న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సాంప్రదాయానికి భిన్నంగా బడ్డెట్ పత్రాలను బ్రీఫ్ కేసులో కాకుండా ఎర్రటి పట్టువస్త్రంలో తీసుకొని వచ్చారు.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ‘ముద్ర యోజన’ దేశంలో సామాన్యుల జీవితాన్ని మార్చేసిందని అన్నారు.
నిర్మాణ రంగంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల మేర బలపడిందని నిర్మల సీతారామన్ చెప్పారు. భారత్లోకి విదేశీ పెట్టుబడులు 64.37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని మంత్రి చెప్పారు.
ముఖ్య అంశాలు..
- విమానయానం, మీడియా, యానిమేషన్, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల పెంపునకు అంగీకారం
- ఒకే బ్రాండ్ కు చెందిన రిటైల్ సెక్టార్ లో ఎఫ్డిఐలకు నిబంధనలు సరళతరం
- జిఎస్టి చెల్లింపునకు పేరు నమోదు చేసుకున్నవారికి రెండు శాతం పన్ను రాయితీ
- విదేశీ, దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు విధానపరమైన సంస్కరణలు
- న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్పిఎల్) అనే కంపెనీ ఏర్పాటు
- ఇస్రో ప్రయోగాలు, అభివృద్ధి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందేందుకు ఎన్ఎస్పిఎల్ ఏర్పాటు చేశాం
- కేంద్ర అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ పిఎల్ కంపెనీ పనిచేస్తుంది
- గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఊరు-పేదవారు-రైతు లక్ష్యంగా ‘అంత్యోద్యయ’ పథకం ప్రారంభం
- 2022 నాటికి 1.95 కోట్ల ఇళ్లను నిర్మిస్తాం.
- ప్రతీ నిరుపేద గ్రామీణ కుటుంబానికి ఇల్లు అందిస్తాం
- 2022 నాటికల్లా అర్హులైన ప్రతీఒక్కరికీ ఉచిత ఎల్పిజీ కనెక్షన్ అందిస్తాం
- హర్-ఘర్-జల్ కింద 2024 నాటికి ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తాం
- రైల్వేశాఖలో ప్రైవేటు పెట్టుబడికి ఆహ్వానం
- మత్స్యకారుల కోసం ‘ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన’ ప్రారంభం
- మత్స్యశాఖ ఆధ్వర్యంలో జాలర్ల సమస్యల పరిష్కారం కోసమే ఈ పథకం తెచ్చాం
- ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా దేశంలో 97 శాతం ప్రాంతాలకు చేరుకునేలా మౌలికవసతులను అభివృద్ధి చేశాం
- చిన్న వ్యాపారులకు 59 నిమిషాల్లో లోన్
- రోడ్ల నిర్మాణానికి రూ.80,250 కోట్లు
- కోత్తగా 10 వేల రైతు సంఘాల ఏర్పాటు
- రోడ్ల నిర్మాణానికి వేస్ట్ ప్లాస్టిక్ ఉపయోగం
- పప్పు ధాన్యల విప్లవం తీసుకొస్తా
- కేవైసీ విధానంలో మార్పులు
- 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్, గ్యాస్ సరఫరా
- ‘జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ
- ‘హర్ ఘర్ జల్’ పథకంలో భాగంగా ఇళ్లకు నీటి సరఫరా
- ఇంట్లో వాడిన వృథా నీరు పొలాలకు వెళ్లేలా చేస్తాం
- స్వఛ్ఛభారత్ కింద 5.6 లక్షల గ్రామాల్లో 9.6 కోట్ల టాయిలెట్ల నిర్మాణం
- త్వరలో 1, 2, 5, 10, 20 రూపాయల కొత్త నాణేల విడుదల. అంధులు కూడా వాటిని గుర్తించగలిగేలా తయారీ
- రానున్న ఐదేళ్లలో మౌలిక సౌకర్యాల కల్పనకు 100 లక్షల కోట్లు రూపాయలు
- బ్యాంకింగ్ రంగం ప్రక్షాళన
- నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు ప్రాధాన్యం
- పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు 7వేల కోట్ల రూపాయల సాయం
- 400 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతానికి తగ్గింపు
- ఏడాదిలో బ్యాంక్ నుంచి రూ.కోటి విత్డ్రా చేస్తే 2 శాతం పన్ను చెల్లించాలి
- డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు చర్యలు
- పాన్ నంబర్ లేకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశం
- పాన్ లేదా ఆధార్ నంబర్తో ఐటీ రిటర్న్స్ దాఖలుకు వెసులుబాటు
- గృహరుణాలపై రూ.3.50లక్షల వరకూ వడ్డీపై పన్ను మినహాయింపు
- బంగారంపై కస్టమ్స్ ఎక్సయిజ్ సుంకం 10 నుంచి 10.25కి పెంపు
- ఒక్కో మహిళకు ముద్ర పధకం ద్వారా రూ.లక్ష రుణం
- 30 లక్షల మంది కార్మికులకు ‘ప్రధాన మంత్రి పెన్షన్ యోజన’ ద్వారా పెన్షన్
- భారత పాస్పోర్టు ఉన్న ఎన్ఆర్ఐలకు సత్వర ఆధార్ కార్డు
- జన్ధన్ ఖాతా కలిగిన మహిళలకు 5 వేలు రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం
- ఇతర దేశాల్లో మరో నాలుగు నూతన ఎంబసీలను ఏర్పాటు చేస్తాం
- 17 ఐకానిక్ టూరిజం కేంద్రాల ఏర్పాటు. వీటి ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం
- దేశవ్యాప్తంగా వృత్తి కళాకారుల కోసం స్ఫూర్తి పేరుతో క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం
- స్ఫూర్తి క్లస్టర్ల ద్వారా 50 వేల మంది వృత్తి కళాకారులకు లబ్ధి