ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన అమలు జరిగేలా సీఆర్డీఏ బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 48 గంటలు గడువు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు సవాల్ విసరడంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి ఏదయినా ఒక నిర్ణయం తీసుకునే ఆ నిర్ణయం నుండి అసలు వెనక్కు తగ్గరు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలిసిందే. జగన్ జగమొండి అని విమర్శలు చేసిన చంద్రబాబే నేడు మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని లేకుంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాతీర్పు కు సిద్ద పడాలి అంటూ చంద్రబాబు సవాల్ విసిరితే జగన్ ఎందుకు స్వీకరిస్తాడని ప్రశ్నిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు 151 మంది సభ్యుల బలంతో పాటు మరో ముగ్గురు టీడీపీ సభ్యులు తోడయ్యారు. ఇంత భారీ మెజారిటీతో ప్రజలు మ్యాండెట్ ఇస్తే అసెంబ్లీని రద్దు ఎందుకు చేస్తారు. ఎదో అధికార పార్టీని రాజకీయంగా ఇరుకున పెట్టాలని చంద్రబాబు పసలేని సవాల్ విసిరారు అని జనం అనుకుంటున్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు.
చంద్రబాబు చేసిన సవాల్ ను జగన్ స్వీకరించి మూడు రాజధానుల నిర్ణయంతో ప్రజల తీర్పు కోరాలని యనమల రామకృషుడు, అయ్యన్న పాత్రుడు, బీటెక్ రవి, దీపక్ రెడ్డి తదితరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ నేతల సవాల్ కు ప్రతి సవాల్ కూడా వదిలారు. చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి అమరావతి సెంటిమెంట్ తో వారంతా గెలిస్తే అప్పుడు మూడు రాజధానులపై పునరాలోచన చేస్తామంటూ పేర్కొన్నారు. అమరావతి సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉండటం వల్లనే వైసీపీ ఛాలెంజ్ స్వీకరించడానికి భయపడుతోందని టీడీపీ విమర్శిస్తోంది.
కాగా చంద్రబాబు చెప్పిన 48 గంటల గడువు బుధవారం సాయంత్రంతో ముగుస్తుండటంతో ఆ తరువాత టీడీపీ ఏమి నిర్ణయం తీసుకోనున్నదనేది ఆసక్తి కరంగా మారింది. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి పోరాటం ఉదృతం చేస్తారా? లేక నిరాహార దీక్షలు చేస్తారా? లేక ప్రత్యక్ష కార్యాచరణ ఏమి ప్రకటించనున్నారు చంద్రబాబు అనేది సాయంత్రానికి తేలనుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?