(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంపై చర్చ సందర్భంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలో చంద్రబాబు వర్సెస్ స్పీకర్ అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ టిడిపి నేతలు పట్టుబట్టారు. ఈ సందర్భంలో స్పీకర్ తమ్మినేని..ఇదేమన్నా ఖవాలి డ్యాన్సా? ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడానికి అని వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురై స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. మర్యాదగా ఉండాలంటూ స్పీకర్ను ఉద్దేశించి చంద్రబాబు అనడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బాబు వ్యాఖ్యలపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల అనుచితంగా మాట్లాడటం స్పీకర్ చైర్ను అవమానించడమేనని తమ్మినేని మండిపడ్డారు.
‘మీ మీద నాకు గౌరవం ఉంది. కానీ ఇష్టానుసారం స్పీకర్పై ఆరోపణలు చేయడం మంచిది కాదు’ అంటూ చంద్రబాబును స్పీకర్ హెచ్చరించారు. స్పీకర్ చైర్ను చంద్రబాబు ఏమాత్రం గౌరవించడం లేదనీ, ఇంత సీనియారిటీ ఉండి ఎమిప్రయోజనం అని ప్రశ్నించారు. తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్పీకర్ డిమాండ్ చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్షం భగ్గుమంది. స్పీకర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను సభ్యులు తప్పుపట్టారు. చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలని వైసిపి సభ్యులు డిమాండ్ చేశారు.