NewsOrbit
టాప్ స్టోరీస్

‘పోరాడుదాం-ప్రాణత్యాగాలు వద్దు’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: రాజధాని కోసం ఏవరూ ప్రాణత్యాగాలు చేయవద్దనీ, పోరాడి సాదిద్ధామనీ రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల త్యాగాలను కూడా గుర్తించలేని మూర్ఖుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం చంద్రబాబు కుటుంబం, నందమూరి కుటుంబ సభ్యులు రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళనలో ఉన్న రైతాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పలేనని అన్నారు. ఈ ఏడాది మన అందరికి ఇది కష్టాల సంక్రాంతి అని వ్యాఖ్యానించారు.ప్రతి ఏటా నారా వారి పల్లె వెళ్లి మూడు రోజుల పాటు పండుగ చేసుకునే వాళ్లమనీ, కానీ ఈ సారి పండగ చేసుకోవడం లేదనీ తెలిపారు.

రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదనీ, అయిదు కోట్ల ఆంధ్రుల సమస్యగా చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని కోసం 29 గ్రామాల రైతులు భూములను త్యాగం చేశారని అన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఇష్టానురీతిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సిఎం జగన్ ఓ మూర్ఖుడు అని దుయ్యబట్టారు. రాజధాని ఎక్కడ ఉండాలో శివరామకృష్ణ కమిటీ పరిశీలించి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసిందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారనీ, భూములు ఇచ్చిన వారిలో వైసిపి కార్యకర్తలు కూడా ఉన్నారని అన్నారు. విశాఖ ప్రజలు రాజధాని అడగలేదనీ, అభివృద్ధి కోరుకున్నారని చెప్పారు. రాయలసీమ ప్రాంత ప్రజలు విశాఖ వెళ్లాలంటే దూరా భారం అవుతుందని అన్నారు. అందరినీ బాధపెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వరదలు వస్తాయనీ, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ అసత్య ప్రచారాలు చేశారనీ మండిపడ్డారు. తన జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఇక్కడ నిర్మించిన వన్నీ పర్మినెంట్ భవనాలేనని చంద్రబాబు అన్నారు. రాజధాని ఒకే సారి నిర్మించాలని చట్ట ప్రకారం సిఆర్‌డిఎ ఏర్పాటు చేసి నిర్మాణాలు మొదలు పెట్టామని పేర్కొన్నారు. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్ళని అన్నారు. అమరావతిని చంపేసి ఒక కన్ను పోగొట్టారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పనులు కూడా ఆపేసి రెండో కన్ను కుడా చంపేసేలా ఉన్నారని అన్నారు.

అమరావతి కంటే ముందుగా కీయా మోటార్స్ తీసుకువచ్చామని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెదాలనేది తన ఆకాంక్ష అని వెల్లడించారు.రాజధాని అమరావతిలో తాను కట్టిన ఏసి రూముల్లో ఉంటూ అసలు నిర్మాణాల జరగలేదని వైసిపి నేతలు అంటున్నారని మండిపడ్డారు. రాజధానిలో రైతు కూలీలకు పెన్షన్‌లు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి గోడు పట్టించుకోకుండా సిఎం ఎడ్ల పందాలకు వెళ్లారని దుయ్యబట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన మహిళలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఉగ్రవాదులా, తీవ్ర వాదులా ఇక్కడ 144 సెక్షన్ ఎందుకు పెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని హైకోర్టు కూడా సుమోటోగా తీసుకుందన్నారు. మంచి కోసం పోరాడుతుంటే వాళ్లు నష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జగన్‌కు జ్ఞానోదయం కావాలన్నారు. జగన్ వల్ల అయిదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు అంధకారంలో పడిందనీ, ఎప్పుడూ లేనట్లుగా మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేసే పరిస్థితి వచ్చిందన్నారు.

ప్రభుత్వం సిఆర్‌డిఎ చట్టాన్ని రద్దు చేసే యోచలో ఉందని రైతులు చంద్రబాబుకు తెలియజేయగా ఏకపక్షంగా ఒక చట్టాన్ని రద్దు చేయడం కుదరదని చంద్రబాబు పేర్కొన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment