అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.
“గుడికొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడం ఏంటి ? వాళ్ల గ్రామ దేవతలని పూజించుకోవడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా? శుక్రవారం గుడికి వెళ్లకపోతే మీలాగా కోర్టుకు వెళ్లమంటారా? రైతులు గుడికే వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులు ఉన్నాయా?” అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
గుడికొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడం ఏంటి? వాళ్ళ గ్రామ దేవతలని పూజించుకోడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా? శుక్రవారం గుడికి వెళ్ళకపోతే మీలాగా కోర్టుకు వెళ్ళమంటారా? రైతులు గుడికి వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టుచేస్తారా? ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులు ఉన్నాయా?#SaveAmaravati pic.twitter.com/4KBnMypBmM
— N Chandrababu Naidu (@ncbn) January 10, 2020
కాగా, శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తుళ్లూరు, మందడంతో పాటూ రాజధాని గ్రామాల మహిళలు, రైతులు ర్యాలీగా బయల్దేరగా.. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ముళ్ల కంచెలు అడ్డు పెడ్డంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో పలువురు కిందపడిపోయారు. ఈ లాఠీచార్జ్లో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి. కొంతమంది రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు.