అమరావతి: ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో టిడిపి మద్యాహ్నం 12 గంటలకు 23 స్థానాలలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షం వైసిపి 150కి పైగా స్థానాలలో మెజారిటీ దిశగా దూసుకు వెళుతోంది. లోక్సభ స్థానాలలో కూడా వైసిపి ప్రభంజనం కనబడుతోంది. మొత్తం 25 స్థానాలలోనూ వైసిపి అధిక్యత కొనసాగుతోంది. పరాజయం తప్పదని ఖచ్చితంగా తేలిపోవడంతో చంద్రబాబు రాజీనామా చేయాలని నిర్ణయించారు.