న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. సాక్షులను ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని అదేశించింది. ఈ కేసుకు సంబంధించి మీడియా సంస్థలకు ముఖాముఖిలు గానీ బహిరంగ ప్రకటనలు గానీ చేయవద్దని సూచిందింది. దేశం విడిచి వెళ్లరాదని పేర్కొన్నది. రెండు లక్షల రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
చిదంబరంపై 2017 మేలో సిబిఐ అవినీతి కేసు నమోదు చేసింది. అదే ఏడాది చివరలో ఈడీ సైతం మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. తొలిసారి గత ఆగస్టు 21న చిదంబరాన్ని ఈ కేసులో సిబిఐ అరెస్టు చేయగా, రెండు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. అక్టోబర్ 16న మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. 108 రోజుల తరువాత జైలు నుండి చిదంబరం విడుదల అవుతున్నారు.