న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చిదంబరం పిటిషన్పై సెప్టెంబరు 5న తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న చిదంబరం.. ఈడీ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిదంబరం పిటిషన్పై జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత ధర్మాసనం .. సెప్టెంబర్ 5న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఈ కేసు విచారణకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం సీబీఐ కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తొలుత 5 రోజులు .. తర్వాత 4 రోజులు చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. రెండో విడత కస్టడీ రేపటితో ముగియనుంది.
previous post
next post