న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. గత 9 రోజులుగా సీబీఐ కస్టడీలోనే ఉన్న చిదంబరంకు మరో 4 రోజులు కస్టడీ పొడిగించారు. ఇక, ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆయనకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పటివరకు చిదంబరంను ఈడీ అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణను పొడిగించింది. వచ్చే సోమవారం వరకు చిదంబరానికి సీబీఐ కస్టడీ కొనసాగుతుందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని ఈడీని ఆదేశించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం సీబీఐ కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తొలుత 5 రోజులు .. తర్వాత 4 రోజులు చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్నారు. రెండో విడత కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. ఈ నేపథ్యంలో చిదంబరం కస్టడీని సెప్టెంబర్ 2వరకు కోర్టు పొడిగించింది.
previous post
next post