న్యూఢిల్లీః ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని ఢిల్లీ హైకోర్టు మరో నాలుగు రోజులకు పొడిగించింది. దీంతో ఈ నెల 30 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. చిదంబరం కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో.. సీబీఐ మరో ఐదు రోజుల పొడిగింపు కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే, మరో నాలుగురోజుల పాటు కస్టడీని పొడిగిస్టున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అంతకుముందు చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. చిదంబరం బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇక సీబీఐ కస్టడీపై జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీం నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.
previous post
next post