అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగించుకున్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన వెనక్కు బయలుదేరారు. ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్టుకు జగన్ చేరుకుని అక్కడ నుంచి మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతానికి నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె వెళతారు. నారాయణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వైయస్ కుటుంబంతో నారాయణకు మూడు దశాబ్దాలకుపైగా అనుబంధం ఉంది. సాయంత్రానికి జగన్ తాడేపల్లికి చేరుకుంటారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న జగన్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి హోంశాఖ మంత్రి అమిత్షా, శుక్రవారం ఉదయం ప్రధాన మంత్రి మోదిలతో భేటీ అయ్యేందుకు హుటాహుటిన వెళ్లారు. అమిత్షా బుధవారం రాత్రి బిజీగా ఉండటంతో జగన్కు అపాయింట్మెంట్ లభించలేదు.
దివంగత రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిలతో పాటు పాదయాత్రలో జగన్తో నారాయణ ఫోటోలు..