అమరావతిః రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో జగన్ సమావేశంకానున్నారు. ఈనెల 26న కడప స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన, జనవరి 9న అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించనున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్షాను కూడా జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కడపలో స్టీల్ప్లాంట్కు డిసెంబరు 26వ తేదీన శంకుస్థాపన చేసేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్ద దండ్లూరు వద్ద 3200 ఎకరాల భూమి కేటాయించాలని కేబినెట్లో తీర్మానించారు.
కాగా, ఈ ఏడాది అక్టోబర్ లోనూ సీఎం జగన్, ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు. ఇరువురి మధ్య పోలవరం, రివర్స్ టెండరింగ్ అంశాలతోపాటు పలు సమస్యలను ప్రధానికి సిఎం జగన్ వివరించారు.