స్థానిక సంస్థల ఎన్నికల అంశం రాష్ట్రంలో దశలవారీగా మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా ఈ విషయంలో మరో ఆసక్తికరమైన ట్విష్టు బయటకు వచ్చింది. ఇదే నిజమైతే ప్రభుత్వానికి మాయని మచ్చగా మారుతుంది. ఎన్నికల కమిషనర్ మార్పు విషయమై కోర్టులో తీర్పు వాయిదాలో ఉండగానే …, మరోవైపు ఎన్నికల విషయమై రకరకాల ప్రచారాలు పుకార్లు వస్తున్నాయి. ఈ చర్చ అంతులేకుండా జరుగుతూనే ఉంది. అసలు ఏపీలో స్థానిక ఎన్నికలపై కేంద్రం వైఖరి ఏమిటో…, తాజా మెలిక మెలిక ఏమిటో.., కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.
అమ్మో 24 శాతం రద్దు కె…!
ఈరోజు ఉదయం నుండి ప్రచారంలో ఉన్న విషయం ఏమిటంటే స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది అని. ఇప్పటివరకు జరిగిన ఏకగ్రీవాలు రద్దుచేసి, కొత్తగా మళ్లీ షెడ్యూలు ప్రకటించి.., కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి బృందాన్ని పంపించి.., ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ఇది ఒక వర్గం ద్వారా బయటకు వచ్చినా ప్రచారం మాత్రమే దీనికి రెండో వైపు కూడా ఇంకో అంశం ఉంది. మాజీ ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరు, ఆ 24 శాతంపై కోర్టుకి ఇచ్చిన ఆఫడవిట్, కేంద్రానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
అంత సులువు కాదు సుమీ…!
ఎన్నికల కమిషనర్ మార్పు నిర్ణయం ప్రస్తుతానికి కోర్టులో ఉంది. ఇది తేలిన తర్వాత ఇరుపక్షాలు ఎవరో ఒకరు(ఓడిన వారు) సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం కూడా ఉంది. అక్కడ తీర్పు రావాలి .., అంటే ఈ రెండు దశలు దానికి కనీసం రెండు నెలలు సమయం పట్టే వీలుంది అంటున్నారు. సో కోర్టులో ఉన్న అంశం ఏమి తేలకుండానే కేంద్ర ఎన్నికల సంఘం ఆకస్మికంగా అలా నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేం. సమాంతరంగా ఒక నివేదిక తప్పించుకొని అంతర్లీనంగా ఆరోపణలు… ఆయా ఈ విషయంపై నివేదిక సిద్ధం చేసుకుంటుంది. అంతే తప్ప కోర్టు నుండి తీర్పు రాక మునుపే ఈ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ తాడో పేడో కి సిద్దం…!
ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్టు ఆ 24 శాతం రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుంది. అందుకే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం ఎక్కడ వరకైనా వెళుతుంది. నాడు తనకు వ్యతిరేక నిర్ణయం వచ్చింది అని…, ఎన్నికల కమిషనర్ మార్పు విషయంలో జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించిన సీఎం జగన్… ఇప్పుడు చూస్తూ చూస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంటే ఊరుకునే ప్రసక్తి ఉండదు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతారు. అదే కాకుండా కేంద్రానికి, వైసీపీకి ఉన్న రహస్య బంధం నేపథ్యంలో ఈ ఆలోచన కూడా మాత్రం వచ్చే అవకాశమే. సో.. ఉండదు దీన్ని ప్రస్తుతం పుకారుగానే చూడడం మంచిది.