అమరావతి:గోదావరి వరద ఉద్ధృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆరా తీశారు. ఇజ్రాయెల్ పర్యాటకలో ఉన్న సిఎం ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సిఎంఒ అధికారులు ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించారు. అధికారులు చేపడుతున్న సహాయక చర్యలను సిఎం అడిగి తెలుసుకున్నారు.
ముంపు బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లూ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారు.ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామగ్రి అందించాలని సీఎం ఆదేశించారు.
ఇప్పటికే ముంపు బాధితులకు పాతిక కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.