అమరావతి: రాష్టంలో పెన్షన్ జాబితా నుండి చాలా మంది పేర్లు తొలగించారని వార్తలు వస్తున్నాయి. పలు ప్రాంతాలలో టిడిపి ఆధ్వర్యంలో రద్దు అయిన పెన్షన్ దారులతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అర్హత ఉన్నా పెన్షన్ రాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని అన్నారు. వెరిఫికేషన్ చేసి అర్హత ఉందని తేలితే రెండు నెలలకు కలిపి ఒకే సారి పెన్షన్ ఇవ్వాలన్నారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే అయిదు రోజుల్లో పెన్షన్కార్డు ఇవ్వాలని చెప్పారు. కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చినా పథకం అందలేదన్న మాటలు వినిపిస్తున్నాయని అన్నారు. పెన్షన్ దరఖాస్తులను ఫిబ్రవరి 17 నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్ చేయాలనీ, 18 కల్లా అప్లోడ్ చేసి 19, 20 తేదీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించాలనీ ఆదేశించారు. తుది జాబితా 20న ప్రకటించాలని సూచించారు. మార్చి ఒకటిన కార్డుతో పాటు, పెన్షన్ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని ఆయన పునరుద్ఘాటించారు. బియ్యం కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
previous post
next post