NewsOrbit
టాప్ స్టోరీస్

కేసీఆరుని ఇక విమర్శించలేరేమో…!

 

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

రాజకీయంగా సమీప ప్రత్యర్ధులు ఎవరూ లేకుండా చేసుసున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కెసిఆర్) రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కట్టడికి కేవలం 20 రోజుల వ్యవధిలో 1500 పడకల కరోనా ఆసుపత్రి ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు చైనాలో ఎనిమిది రోజుల వ్యవధిలో 1000 పడకల ఆసుపత్రి నిర్మించారని గొప్పగా చెప్పుకోవడం చూశాము. అయితే తెలంగాణ సీఎం కెసిఆర్ ఈ రికార్డ్ తిరగ రాశారు.

కరోనా వైరస్ ప్రభావాన్ని తీవ్రంగా పరిగణించిన కెసిఆర్

దేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన తొలినాళ్లలో కెసిఆర్ దీన్ని తీవ్రంగా తీసుకోలేదు. ఇది అంత ప్రమాదకరం కాదని తేలికగా తీసుకున్నారు. పారాసెటమాల్ లాంటి మాత్ర వేసుకుంటే చాలు అన్నట్లుగా కెసిఆర్ చెప్పారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వివిధ దేశాలతో పాటు మన దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో దీన్ని సిఎం కెసిఆర్ తీవ్రంగా పరిగణిస్తూ నివారణ చర్యలను ఉదృతం చేశారు. లాక్ డౌన్ ను పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేకుండా తొలుత ఈ నెల 31 వరకు, మళ్ళీ మే 7వ తేదీ వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

గచ్చిబౌలిలో 1500 పడకల ఆసుపత్రి

హైదరాబాద్ శివారు గచ్చిబౌలిలో గల స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఓ కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చేశారు. 15 అంతస్తులున్న ఈ భవనంలో ఆస్పత్రికి సంబంధించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేసి 1500 పడకల ఆస్పత్రిగా రూపొందించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల్లో దాదాపు వెయ్యి మంది కార్మికులు 20 రోజుల పాటు అహర్నిశలు శ్రమించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో దేశంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిగా తీర్చిదిద్ది నేడు ప్రారంభించారు. కరోనా వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. ఫర్నిచర్, మెడికల్ కిట్స్‌ అన్నీ సిద్ధం చేశారు.

తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రి భవనంలో 468 గదులు ఉండగా 50 పడకల ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో అంతస్తులో 36 గదులు ఉండగా ఒక్కో గదిలో 23 పడకలు ఏర్పాటు చేశారు. కరోనా పేషంట్ లను ఈ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించేందుకు డిప్యూటేషన్ ద్వారా 70 మంది డాక్టర్లను, 120 మంది నర్సులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించారు.

భవిష్యత్ లో టిమ్స్

కరోనా తగ్గిన తరువాత ఈ ఆస్పత్రిని భువనగిరి ఏయిమ్స్ తరహాలో టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్)ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏయిమ్స్ తరహాలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment