హైదరాబాద్: హరితహారంలో పంపిణీ చేసిన 85 శాతం మొక్కలు బతికి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. లేని పక్షంలో సర్పంచ్లపై వేటు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ రాజేంద్రనగర్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాభివృద్ధిపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలిస్తామన్నారు. అలసత్వం, అజాగ్రత్త వహించిన గ్రామ సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు ఉంటయాని హెచ్చరించారు. కలెక్టర్ల వార్షిక నివేదికలు ఇకపై తానే రాస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. కలెక్టర్లు, మండలస్థాయి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇచ్చి వాటిని సంరంక్షించేలా చూడాలన్నారు. కలెక్టర్లు, మండలస్థాయి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలనీ, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇచ్చి వాటిని సంరంక్షించేలా చూడాలన్నారు.
మిషన్ భగీరథతో తాగునీటి అవసరాలు తీరాయన్నారు. గ్రామాభివృద్ది తనిఖీ చేయడానికి వంద బృందాలను ఏర్పాటు చేస్తామనీ, 30 రోజుల ప్రణాళిక అనంతరం ఈ బృందాలు రంగంలోకి దిగుతాయన్నారు. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలిస్తామన్నారు. అలసత్వం, అజాగ్రత్త వహించిన గ్రామ సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తప్పవన్నారు. ప్రతీ గ్రామంలోనూ రాబోయే 6 నెలల్లోపు శ్మశాన వాటికలు నిర్మించాలనీ, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని సీఎం చెప్పారు.