(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సోనియా కొన్ని రోజులుగా జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిమిత్తం సోనియాను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో సోనియాకు సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కొన్నిరోజులుగా ఆమె ఆరోగ్యం నిలకడగా లేదని, వైద్య పరీక్షల కోసమే సోనియా ఆసుపత్రికి వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.