న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధులు భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బ్రిటిషర్లపై తిరుగులేని పోరాటం చేసి ఆనాటి దేశభక్తుల్లో వారు ముగ్గురు స్ఫూర్తి నింపారని మనీష్ తివారీ తెలిపారు. స్వతంత్ర పోరాటంలో వారు అమరులయ్యారని గుర్తుచేశారు. ఇప్పటికీ వారిని ప్రజలు ‘షహీద్-ఇ-ఆజం’ బిరుదుతో గుర్తు పెట్టుకున్నారని, మొహాలీ ఎయిర్ పోర్ట్కు ‘షహీద్-ఇ-ఆజం భగత్సింగ్’ అని నామకరణం చేశారని పేర్కొన్నారు. 2020 జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వారిని భారతరత్నతో గౌరవించాలని కోరారు.
My letter to H’onble Prime Minister @narendramodi formally requesting him to accord Bharat Ratna to Shaheed-E-Azam’s Bhagat Singh, Rajguru & Sukhdev.Formally Confer the honorific of Shaheed-E-Azam on them & dedicate Chandigarh Airport located in Mohali in memory of Bhagat Singhji pic.twitter.com/PfqduZq8oi
— Manish Tewari (@ManishTewari) October 26, 2019
గతంలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు భారతరత్న ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ మహాసభ వ్యవస్థాపకుడు వీర్ సావర్కర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీ తమ మ్యానిఫెస్టోలో పేర్కొంది. అయితే, వీర్ సావర్కర్కు భారతరత్న ఇస్తామని ప్రకటించడంపై కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు కూడా భారతరత్న ఇవ్వండంటూ కేంద్రంపై అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
భగత్సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్లను 1931, మార్చి 23న ఉరితీశారు. వీరికి 1930లో అక్టోబర్ 7వ తేదీని ఈ మరణశిక్షను ఖరారు చేశారు. వీరిని ఉరితీసిన రోజును పురస్కరించుకుని మార్చి 23ను జాతీయ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు.