హైదరాబాద్: మైహోం రామేశ్వర్రావుకు భూకేటాయింపులపై హైకోర్టులో కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి పిల్ దాఖలు చేశారు. నేడు పిల్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాయదుర్గంలో వందల కోట్ల విలువైన భూమిని మైహోమ్కు కేటాయించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా 38 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారనీ రేవంత్ పిల్లో పేర్కొన్నారు. దీనిపై రామేశ్వర్రావుతో పాటు, ప్రభుత్వానికి, డీఎల్ఎఫ్ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
previous post
next post