‘‘ఎట్టకేలకు ఓ కాంగ్రెస్ మనిషి మాట్లాడారు.. ఆయన నిజం మాట్లాడారు!! ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి, ప్రియాంకా గాంధీకి బానిసలుగా ఉంటుందా లేదా జాతి గురించి ఆలోచిస్తుందా నిర్ణయించుకోవాలి’’
ఈ అర్థం వచ్చే సందేశాన్ని నరేంద్రమోదీని సోషల్ మీడియాలో బాగా సమర్ధించే గౌరవ్ ప్రధాన్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. దాంతోపాటు గుండు వ్యక్తి ఒకరు కెమెరా ముందు మాట్లాడుతున్న వీడియో క్లిప్ కూడా ఉంది. ఆ వ్యక్తి కాంగ్రెస్ మనిషని గౌరవ్ ప్రధాన్ అన్నారు. గతంలో తప్పుడు సమాచారాన్ని ఈయన ప్రచారం చేసేవారని ‘ఆల్ట్ న్యూస్’ వెబ్ సైట్ పేర్కొంది.
https://twitter.com/DrGPradhan/status/1097510406489325568
ఈ వీడియో క్లిప్ సుమారు రెండున్నర నిమిషాలుంది. ఆ వ్యక్తి పార్టీ కోర్ కమిటీ సమావేశం గురించి చెప్పినట్లు, తర్వాత తల్లీ కొడుకులు పార్టీని నాశనం చేస్తున్నరన్నట్లు వీడియోలో ఉంది. తర్వాత ఆశ్రిత పక్షపాతం పార్టీ లక్షణంగా మారిపోయిందని చెప్పి, మన్మోహన్ సింగ్ రిమోట్ కంట్రోల్ నాయకుడని అన్నట్లుంది. వీడియో చివరిలో ‘ఇవన్నీ నా అభిప్రాయాలు’ అని ఆయన అంటారు.
నమో ఎగైన్ 2019 అనే ఫేస్ బుక్ పేజీలో కూడా ఇది షేర్ అయింది. ఆ వ్యక్తి వారణాసిలో నరేంద్రమోదీ మీద పోటీ చేస్తున్న అజయ్ రాయ్ అని అందులో చెప్పారు. వీడియోను ఇప్పటికి 69 వేల సార్లు చూడగా, 3300 సార్లు షేర్ చేశారు.
https://www.facebook.com/NamoAgain2O19/videos/370011676938645/
పలువురు ఫేస్ బుక్, ట్విటర్ యూజర్లు ఈ వీడియోను తమ టైంలైన్ మీద పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ నాయకుడే కాదు..
నిజానికి గౌరవ్ ప్రధాన్ చెప్పినట్లుగా ఆ వ్యక్తి కాంగ్రెస్ నాయకుడూ కాదు, కనీసం పార్టీ సభ్యుడు కూడా కాదు. వారణాసి నుంచి పోటీచేసే అజయ్ రాయ్ కానేకాదు. అతడిపేరు అనిల్ భూల్ చందానీ. భోపాల్ లో నివసిస్తారని అతడి ఫేస్ బుక్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. ఫిబ్రవరి 8న భూల్ చందానీ ఈ క్లిప్ పోస్ట్ చేశారు. ‘‘మేరే ద్వారా నాటకీయ రూపాంతరణ్’’ అని వీడియోకు కేప్షన్ పెట్టారు.
https://www.facebook.com/anil.boolchandani.3/videos/2289684861310289/
భూల్ చందానీ బీజేపీ మద్దతుదారు అని అతడి ఫేస్ బుక్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తుంది. ఇటీవలే బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా ఠాకుర్ తో కలిసి ఫొటో తీయించుకున్నారు.
https://www.facebook.com/anil.boolchandani.3/posts/2336528559959252
భూల్ చందానీ కేవలం ఆ వీడియోలో నటించారని అతడి పోస్టును బట్టి తెలుస్తోంది. ఈ వీడియోను బీజేపీ అనుకూల సోషల్ మీడియా వాళ్లు పట్టుకుని, దాన్ని తప్పుడు వివరాలతో విస్తృతంగా ప్రచారం చేశారు.