హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఎన్నికలు వెంటనే జరిపించాలని అన్నారు. ఇన్ చార్జ్ ల పదవీకాలం ముగిసేలోగానే షెడ్యూల్ ను ప్రకటించాలని సూచించారు. దీంతో అధికారులు సహకార సంఘాల ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. కాగా, తెలంగాణలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. తాజాగా సహకార సంఘాల ఎన్నికలు జరగనుండడంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది.