న్యూఢిల్లీ: హవాలా అభియోగాలపై కేసులు ఎదుర్కొంటున్న ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వధ్రా చికిత్స కోసం విదేశాలు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు ఒకటి అనుమతి ఇచ్చింది. అమెరికా గానీ, నెదర్లాండ్స్ గానీ వెళ్లవచ్చనీ, లండన్ వెళ్లేందుకు మాత్రం వీలు లేదనీ కోర్టు పేర్కొన్నది.
వైద్య చికిత్స కోసం ఆరు నెలల పాటు విదేశంలో ఉండేందుకు కోర్టు వధ్రాకు అనుమతి ఇచ్చింది. వధ్రాపై వచ్చిన హవాలా ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దర్యాప్తు చేస్తున్నది. వారికి అభ్యంతరం ఉన్నట్లయితే తన క్లయింట్ బ్రిటన్ వెళ్లబోరని వధ్రా తరపు న్యాయవాది కెట్ఎస్ తులసి కోర్టుకు హామీ ఇచ్చారు.