(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంపై జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
అమరావతి రాజధాని అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా లేఖ రాస్తారని ఆయన తెలిపారు. ఏపి అసెంబ్లీలో వైసిపి ప్రభుత్వం రాజధానిపై చేయబోయే తీర్మానానికి విలువలేదని అన్నారు. రాజధాని విశాఖకు తరలిస్తే అమరావతి కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. ఉద్యోగులకు రాయితీలు, ఇతర ఖర్చులతో కోట్ల రూపాయల వ్యయం అవుతుందనీ, అదే డబ్బుతో అమరావతిలోనే గొప్ప రాజధాని నిర్మాణం చేయవచ్చనీ నారాయణ అన్నారు.