అమరావతి: రాజధాని అమరావతి రైతుల ఆందోళనకు సిపిఐ బాసటగా నిలిచింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సిపిఐ జాతీయ సమితి తీర్మానం చేసింది. కోల్ కతాలో జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తెలిపారు.
సిపిఐ జాతీయ సమితి సమావేశంలో డీ. రాజాతో పాటు అతుల్ కుమార్ అంజాన్, కె.నారాయణ, కె. రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు బినయ్ విశ్వం, సుబ్బరాయన్ తదితరులు పాల్గొన్నారు.