(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్ బుల్ తుఫాను తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఈ తుఫాను అర్ధం రాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, పారా దీప్, బాంగ్లాదేశ్ తీరాలలో గంటకు 120 నుండి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి.
ఈ తుఫాన్ ప్రభావం తో ఏపిలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో జాలర్లు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తుఫాన్ ప్రభావంతో ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలతో పాటు ఏపిలో నేడు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.