(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ముప్పు తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వాయు తుపాను మళ్లీ దిశ మార్చింది. ఇది రాగల 48 గంటల్లో వెనుతిరిగి గుజరాత్ తీరం దారి పట్టే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వాయు తుపాను జూన్ 16న దారి మార్చుకుని 17-18 తేదీల్లో కచ్ వద్ద గుజరాత్ తీరం తాకవచ్చని భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవన్ అంటున్నారు.
వాయు తుపాను వల్ల గుజరాత్ తీరానికి ఇక ముప్పేమీ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే రాజీవన్ ఈ మాట చెప్పారు. అయితే రాజీవన్ ఒక చల్లటి మాట కూడా చెప్పారు. అతి తీవ్ర తుపానుగా రూపొందిన వాయు శక్తి కోల్పోయి తీరం దగ్గరకు వచ్చేసరికి తుపానుగానో, తీవ్ర వాయుగుండంగానో మారవచ్చని అన్నారు.