(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం జిల్లాలలో భారీ వర్షం కురిసి జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, కర్నాటక, మధ్య మహారాష్ట్ర, గోవా, కొంకణ్, తూర్పు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుశ్చేరి, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, అసోం, ఒడిషా, మేఘాలయ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
జార్ఖండ్, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అసోం రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అప్రమత్తంగా ఉండాలనీ సూచించింది, తమిళనాడు, మల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్ల బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది.
మంగళవారం మధ్యాహ్నం నుండి అర్థరాత్రి వరకూ హైదరాబాద్ కుంభవృష్టి కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.