(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కరోనా ప్రభావంతో చిన్నా,పెద్దా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇది సెలెబ్రిటీలకు మంచి సమయంగా మిగిలిపోతుంది. మనకు తరచు సినీ తారలు, కొందరు రాజకీయ నేతలు రకరకాలా ఫీట్లు చేసే వీడియోలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ వీడియో మాత్రం అరుదు. మనం ఇప్పుడు దగ్గుబాటి వారి పాకాశాల కి వెళ్లబోతున్నాం. తెలుగునాట పరిచయం అవసరం లేని దంపతులు దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావులు. వారు ఇద్దరూ కలిసి చికెన్ బిరియాని, నాటుకోడి పులుసు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంటే ఈ వీడియో వీక్షించండి. లాక్ డౌన్ నేపథ్యంలో వారు ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబానికి ఎక్కువ విలువ ఇచ్చే వారు, తాజాగా తమ కుటుంబానికి తామే స్వయంగా వంట చేసి రుచి చూపించారు. మూడున్నర నిముషాల ఉన్న వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఏ సినీ తారలో, ఏ తాజకీయా నేతలో చేస్తే ఒక అరుదు కానీ… రాజకీయంగా పండిపోయిన దగ్గుబాటి ఇలా గెరిటే తిప్పడం మరి వేరైటీనే కదా అందుకే ఇది చూడాల్సిందే…!