(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని తరలింపు బిల్లు, సిఆర్డిఏ చట్టం రద్దు బిల్లును కలిపి చర్చించాలని శాసనమండలి నిర్ణయించింది. ఈ మేరకు టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ సభలో చర్చను ప్రారంభించారు. మూడు ముక్కల రాజధానిని తెలుగుదేశం వ్యతిరేకిస్తున్నదని లోకేష్ పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనీ, పరిపాలనా వికేంద్రీకరణ కాదని లోకేష్ అన్నారు.
నాలుగు గంటల పాటు చర్చ జరుగుతుందని వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ప్రకటించారు.
బిల్లులపై చర్చకు టిడిపికి 84 నిముషాలు, నామినేటెడ్ సభ్యులకు ఎనిమిది నిముషాలు,ఇండిపెండెంట్ సభ్యులకు తొమ్మిది నిముషాలు, వైసిపి సభ్యులకు 27 నిముషాలు, పిడిఎఫ్ సభ్యులకు 15 నిముషాలు, బిజెపి సభ్యలకు ఆరు నిముషాల పాటు సమయాన్ని కేటాయించారు.