(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఫ్రెంచ్ కంపెనీ దస్సాల్ట్ ఏవియేషన్ నుంచి కొనుగోలు చేసిన 36 రఫేల్ యుద్ధవిమానాలలో మొదటి విమానాన్ని ఇండియా అందుకుంది. మూడు రోజుల పర్యటనకోసం ఫ్రాన్స్ వెళ్లిన రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ బోర్డూ లోని దసూల్ట్ కార్యాలయం వద్ద విమానం అందుకున్నారు.
మంగళవారం దసరా అయిన కారణంగా విమానానికి ఆయుధ పూజ చేశారు. తర్వాత రాజనాధ్ సింగ్ రఫేల్లో గగనవిహారం చేయనున్నారు. ఇండియా, ఫ్రాన్స్ సంబంధాలలో ఇది చారిత్రాత్మకమైన దినం అని రాజనాధ్ అన్నారు. భారత ప్రభుత్వం లక్ష్యం వాయుసేనను బలోపేతం చేయడమనీ, రఫేల్ యుద్ధవిమానాలు అందుకు తోడ్పడతాయనీ ఆయన అన్నారు.
59 వేల కోట్ల రూపాయలతో ఇండియా 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి బ్యాచ్ నాలుగు విమానాలు వచ్చే ఏడాది మే నెలలో అందుతాయి. మిగతా విమానాలు 2022 నాటికి అందాల్సిఉంది.