పగ పాగా వేస్తె ప్రత్యర్థి నష్టపోవాలని కోరుకోవడం దుర్భుద్ధి…! పగ కసిగా మారి పాగా వేస్తె ప్రత్యర్థిని అంతం చేయాలనుకోవడం దురాలోచన, అమానవీయం…! ఎటువంటి సంబంధం లేని ఒక అధికారిని నిర్బంధించి, గంటల తరబడి హింసించి, నరకం చూపించి, వందలసార్లు పొడిచి, పొడిచి చంపితే అది ఆకృత్యం, అంతకు మించిన పైశాచికం, దానికి మించిన క్రూరత్వం. ఢిల్లీలో అదే జరిగింది. ఈశాన్య ఢిల్లీలో వారం రోజులుగా జరుగుతున్నా అల్లర్లలో ఓ ఐబీ అధికారిని చంపేశారని, కాలువలో అతని మృతదేహాన్ని పడేశారని వార్తల్లో చూసాం, విన్నాం. దీనిలో తాజాగా బయటపడుతున్న అంశాలు తెలిస్తే… పగవారికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా, గుండె తరుక్కుపోయేలా, మెదడు కకావికలమైపోయేలా ఉన్నాయి. ఆయన్ని ఆరు గంటల పాటు నిర్బంధించి, 400 సార్లు కత్తితో పొడిచారట. ఆయన శరీరంలో ప్రతి అవయవాన్ని ఛిద్రం చేశారట, పేగులను కూడా బయటకు తీసి, ముక్కలు ముక్కలు చేశారట. అంత్యంత అమానవీయం, ఆకృత్యమైన ఈ ఘటన ఢిల్లీ అల్లర్లలో జరగడం ఇప్పుడు అందరిని కలచివేస్తుంది.
ఆప్ మాజీ నేత పై కేసు నమోదు…!
ఢిల్లీలో ఐబీ అధికారిగా విధుల్లో ఉన్న అంకిత్ శర్మ మంగళవారం నుండి కనిపించకుండా పోయారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని అల్లర్లు జరుగుతున్నప్రాంతంలోని డ్రెయిన్ లో ఆయన మృతదేహం కనిపించింది. అంకిత్ తండ్రి రవీందర్ శర్మ దీనిపై పోలీసులకు పిర్యాదు చేసారు. తన కుమారుడ్ని ఆమ్ నేత హుస్సేన్ కి చెందిన భవనం లోకి తీసుకెళ్లారని, అక్కడే అల్లరి మూకలు చంపేసి ఉంటారని పిర్యాదు చేసారు. దీంతో పోలీసులు హుస్సేన్ పై కేసు నమోదు చేసారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే హుస్సేన్ ను పార్టీ నుండి ఆప్ సస్పెండ్ చేసింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేసారు. అల్లర్లలో, అంకిత్ హత్యలో ఎవరున్నా శిక్షించండి. ఒకవేళ ఆప్ నేతలు ఉంటె రెండు రేట్లు అధికంగా శిక్ష వేయండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. పారామిలిటరీ బలగాలు మోహరించి, వీధి వీధిన పహారా కాస్తున్నారు. దాదాపు 80 వేలమంది పోలీసులు ఇక్కడ విధుల్లో ఉన్నారు.