విజయ్ మాల్యాకు బెంగళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీలోని న్యాయస్థానం శనివారం ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. మాల్యాను ఇప్పటికే ప్రకటిత నేరగాడిగా కోర్టు పేర్కొన్నది. ఫెరా చట్టాన్ని ఉల్లంఘించిన కేసుకు సంబంధించి ఈ ఆదేశాలను ఇచ్చింది.
ఢిల్లీ చీఫ్ మెట్రోపొలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఈ ఉత్తర్వులు జారీచేశారు. జులై పదవ తేదీ వరకూ గడువు విధించింది.
బెంగళూరు పోలీసులు ఇప్పటికే దాదాపు 159 ఆస్తులను గుర్తించి కోర్టుకు తెలియజేశారు.
ఫెరా చట్టం కింద జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది.
మాల్యాపై నాన్ బెయిలబుల్ వారంట్ పెండింగ్లో ఉన్నది.
తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్కు పాల్పడ్డారని విజయ్ మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి.
రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు ఎస్బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో 2016లో విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి బ్రిటన్లో ఉంటున్నాడు. ఆయన్ను భారత్ రప్పించేందుకు సిబిఐ, ఈడి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి