(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీని అభినందించిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఊహించని వైపు నుంచి దెబ్బ తగిలింది. బిజెపిని మట్టి కరిపించిన ఆప్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 స్థానాలను గెలుచుకోగా మిగిలిన చోట్ల బీజేపీ గెలుపొందింది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.
ఫలితాలు వెలువడిన అనంతరం స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, బుకాయింపుదారులు వోడిపోయి ఆప్ గెలిచిందని వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించినందుకు ఢిల్లీ ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని అన్నారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలో సెటిలైన ప్రజలు ప్రమాదకరమైన బిజెపి అజెండాను తిరస్కరించారని పేర్కొన్నారు. బీజేపీని ఓడించడం ద్వారా 2021, 2022 సంవత్సరాల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఢిల్లీ ప్రజలు ఒక సందేశాన్ని ఇచ్చారని అన్నారు.
చిదంబరం వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ‘ప్రాంతీయ పార్టీల ద్వారా బీజేపీని ఓడించే పనిని కాంగ్రెస్ తీసుకుందా ఏమిటి అని చిదంబరాన్ని ప్రశ్నించారు. తీసుకోకుంటే మన ఘోర పరాజయం గురించి ఆందోళన చెందకుండా.. ఆప్ విజయంపై మనం కేరింతలు కొట్టాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఆ పని చేపట్టిఉంటే… మనం దుకాణం మూసుకోవడం మంచిది’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
With due respect sir, just want to know- has @INCIndia outsourced the task of defeating BJP to state parties? If not, then why r we gloating over AAP victory rather than being concerned abt our drubbing? And if ‘yes’, then we (PCCs) might as well close shop! https://t.co/Zw3KJIfsRx
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) February 11, 2020