(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి వరసగా మూడవ విజయం దక్కడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇక ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ల భద్రతపై దృష్టి సారిస్తున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో శనివారం పోలింగ్ జరగగా మంగళవారం వోట్లల లెక్కిపు చేపట్టనున్నారు.
ఇవిఎంల భద్రత గురించి చర్చించేందుకు ముఖ్యమంత్ర కేజ్రీవాల్ తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ కుమార్ సిసోడియా, ఆప్ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, గోపాల్ రాయ్ తదితర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
70 సీట్ల ఢిల్లీ శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 36 మంది శాసనసభ్యుల బలం ఉండాలి. శనివారం పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని మెజారిటీ చూపించాయి. కనీసం అర డజను అంచనాలు వెలువడగా ఆప్కు సగటున 56 సీట్లు రావచ్చని అవి సూచిస్తున్నాయి. టైమ్స్ నౌ అత్యల్పంగా 47 సీట్లు రావచ్చని ప్రకటించగా, ఇండియా టుడే అత్యధికంగా 59 – 68 సీట్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నది.