న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్పై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించడం అభియోగాలపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టును కోరారు.
శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవహారంపై సునంద మీడియా సమావేశం నిర్వహించనుండగా ఆమె మరణం సంభవించిందని పోలీసులు పేర్కొన్నారు. సునంద మరణానికి ముందు కొన్ని రోజులుగా కాటీ అనే మహిళ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడుతుండేవారని పోలీసులు కోర్టుకు తెలిపారు.