న్యూఢిల్లీ: ఉత్తర భారదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సిఆర్ ప్రాంతంతో పాటు కశ్మీర్, పంజాబ్, హర్యానా, గురుగ్రామ్లో భూమి కంపించింది. భారత కాల మానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.35 నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలకు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరో వైపు పాకిస్తాన్లోని లాహోర్కు 173 కిలో మీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రంగా భూప్రకంపనలు వచ్చాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండిలో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.3 గా నమోదు అయింది. కశ్మీర్లోని పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో ప్రకంపనలు మరికొంత తీవ్రంగా నమోదు అయ్యాయి.
previous post
next post