న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బిజిపికి అనుకూలంగా వచ్చిన మీద ప్రతిపక్షాలు ఇవిఎంలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్పై వత్తిడి పెంచాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ముందు వివిప్యాట్ స్లిప్పులు లెక్కించాలని, తర్వాతే ఇవిఎంల కౌటింగ్ చేపట్టాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మంగళవారం ఢిల్లీ, కాన్స్టిట్యూషన్ క్లబ్లో 22 ప్రతిపక్షాలు రెండు సార్లు సమావేశమ్యయాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశాలకు హాజర్యయారు. అనంతరం అందరూ నడుచుకుంటూ ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లారు.
అయిదు వివిప్యాట్లను ఎంపిక చేసి ఇవిఎంల కౌంటింగ్ కన్నా ముందు వాటిలోని స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్షాలు కమిషన్ను కోరాయి. తర్వాత ఇవిఎంల కౌంటింగ్కూ వివిప్యాట్ స్లిప్పుల లెక్కింపుకూ మధ్య వ్యత్యాసం ఉన్న పక్షంలో అన్ని వివిప్యాట్లనూ లెక్కించాలనీ కమిషన్కు సమర్పించిన మెమొరాండంలో కోరారు. ఈ విషయమై బుధవారం ఉదయం నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి చెప్పారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు మెమొరాండంలో కొన్ని చర్యలు సూచించారు. అయిదు రాష్ట్రాలలో ఇవిఎంలను తరలిస్తున్నట్లు వచ్చిన వార్తలపై కూడా ప్రతిపక్షాలు ఆందోళన వెలిబుచ్చాయి.