అమరావతి, ఏప్రిల్ 2: ఎన్నికలు జరుగుతున్న వేళ టిడిపి కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడి కంపెనీకి చెందిన పలు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది.
టిడిపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కి చెందిన కంపెనీల 315 కోట్ల రూపాయల ఆస్తుల ను ఈడీ అటాచ్ చేసింది. బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని వాటిని షెల్ కంపెనీల ద్వారా తన సంస్థకు దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై గతంలో లో సిబిఐ విచారణ జరిపి ఈడికి బదిలీ చేసింది. బిసి ఈ పి ఎల్ కంపెనీ ద్వారా 364 కోట్లు రూపాయల రుణం తీసుకున్నారని సుజనా చౌదరి పై ఆరోపణలు ఉన్నాయి. చెన్నై లోని ఆంధ్రాబ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ తదితర బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నారు.
షెల్ కంపెనీల నుండి తీసుకున్న రుణాలను వైస్రాయ్ హోటల్స్ , మహాల్ హోటల్స్ లకు బదిలీ చేసినట్లు సిబిఐ గుర్తించింది.
ఈ కేసులో స్వాధీనం చేసుకున్న ఈ డి మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రకారం ఢిల్లీ చెన్నై బెంగళూరు లోని ఆస్తులను అటాచ్ చేసింది.