న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో ఈడీ అధికారుల ముందుకు హాజరైయ్యారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు ఈడీ ఆఫీస్ కు వచ్చారు. ఈడీ పంపిన సమన్లపై శివకుమార్ వేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో… నిన్న రాత్రి ఆయనకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ఆయన విచారణకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఈ ఉదయం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను టెన్షన్ పడడం లేదు. ఎవరూ టెన్షన్ పడొద్దు. నేను ఏ తప్పూ చేయలేదు. అత్యాచారం వంటి నేరం కానీ, ఎవరి వద్ద నుంచైనా డబ్బు తీసుకోవడం కానీ చేయలేదు. నాకు వ్యతిరేకంగా ఏమీ లేదు’ అన్నారు. గుజరాత్ కు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలును బెంగళూరు నగర శివార్లలోని ఓ రిసార్టులో పెట్టి కాపాడుకున్నందుకు తన మీద ఇలాంటి వేధింపుల కేసులు పెట్టారని ఆరోపించారు. కేంద్రంలోని పెద్దల ఆదేశాలతో ఈడీ అధికారులు సమన్లు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారన్నారు. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని శివకుమార్ వెల్లడించారు.
IT raid on me was politically motivated for hosting Gujarat Congress MLAs
As a loyal soldier of Congress & a responsible politician, I did what party asked me to do, for which I am being targeted
I have full faith in legal systems & will face this legally as well as politically
— DK Shivakumar (@DKShivakumar) August 30, 2019
Have received summons from ED late yesterday night at 9.40 PM asking for me to appear at 1PM in Delhi today.
Although the sudden scheduling by ED is malafide, I believe in rule of law & will definitely participate & fully co-operate with them and abide by the law of our country.
— DK Shivakumar (@DKShivakumar) August 30, 2019